దక్షిన తెలంగాణ

కవి కోయిలల ‘పంచమ స్వరం’!(పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు : 110, వెల : 100/-
ప్రతులకు:
కె.ఎస్.అనంతాచార్య
7-2-237,
(న్యూ) మంకమ్మతోట
కరీంనగర్ - 505001
సెల్.నం.9441195765
**
గత ఇరవై ఆరు ఏళ్లుగా సాహితీ రంగంలో విశేష కృషి చేస్తున్న కరీంనగర్ సాహితీ గౌతమి (జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య) వైవిధ్య భరితమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. శ్రీ కె.ఎస్.అనంతాచార్య, దాస్యం సేనాధిపతి అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న సాహితీ గౌతమి రాష్టస్థ్రాయిలో సినారె కవితా పురస్కారంతో పాటు గండ్ర హన్మంత రావు స్మారక సాహితీ పురస్కారం, చింతల లక్ష్మారెడ్డి స్మారక సాహితీ పురస్కారం, బొందుగుల పాటి స్మారక సాహితీ పురస్కారాలను ప్రతీ ఏటా అందిస్తోంది. గ్రంథావిష్కరణలు, గ్రంథ పరిచయాలు, సాహిత్య సంబంధ కార్యశాలలు వంటి కార్యక్రమాలతో పాటు గ్రంథ ప్రచురణలు చేపట్టడం విశేషం! శ్రీ కె.ఎస్.అనంతాచార్య నేతృత్వంలో వారాల ఆనంద్, ఎం.గోపాల్, డాక్టర్ బి.వి.ఎన్.స్వామి, దాస్యం సేనాధిపతి సహకారంతో వసంతరాగం, జయగానం, పంచమ స్వరం, వచన కవితా సంకలనాలను వెలువరించారు. ‘కుదురు’, ‘పంచపాల’ పేరుతో కరీంనగర్ కథా సంకలనాలను వెలువరించడం విశేషం! ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాన్ని నిర్వహించి..కవితలన్నింటినీ ఏర్చి కూర్చి ఓ కవితా సంకలనాన్ని ప్రచురించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే..‘పంచమ స్వరం’ పేరుతో ఉగాది కవితా సంకలనం-3ను వెలువరించారు. శ్రీ కడారి అనంత రెడ్డి సౌజన్యంతో వెలువడిన ఈ గ్రంథంలో 67 మంది కవుల రచనలు చోటు చేసుకున్నాయి. ‘మన్మథ’నామ సంవత్సర కవి సమ్మేళనం సందర్భంగా వచ్చిన కవితల్ని ఇందులో పొందుపరిచారు.
‘రమ్ము రావోయి తెలంగాణ రాష్టమ్రునకు/దండి బతుకమ్మ బోనాల పండుగలను! సంబరములు నిండారంగ జరుపుకొనుచు/ ఏడు గడుపుదమోయి మన మాడుకుంటు’ డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
పేరు ఏదైతేనేం...పేదల పెన్నిధి కావాలని డాక్టర్ డింగరి నరహరి ఆచార్య ఆకాంక్షించారు. ఇవాళ ‘రుబ్బురోలు’ నిర్వహించే రోల్ పెద్దగా ఏమీ లేకపోయినా..మనుషులు మాత్రం ఇప్పటికీ ఏ రోటి పాట ఆరోటి దగ్గర పాడటమే బొత్తిగా బాగోలేదని డాక్టర్ నలిమెల భాస్కర్ తమ కవితలో వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దేదీప్యమానంగా వెలగాలని జి.వి.కృష్ణమూర్తి తమ కవిత ద్వారా ఆకాంక్షించారు.
బడుగువర్గాల బతుకులు బాగుపడాలని సముద్రాల వేణుగోపాలాచార్య కొత్త వత్సరాన్ని వేడుకున్నారు. మరణమే శరణ్యమంటూ ఆత్మహత్య బాట పట్టిన రైతన్నలకు దాస్యం తమ కవిత ద్వారా భరోసానిచ్చారు. తొలకరి జల్లు సిగ్గుతో పృథ్వీ పొరల్ని ముద్దాడిన వైనాన్ని పోరెడ్డి సౌజన్య తమ కవితలో వివరించారు. వరములిస్తూ తరలి రమ్మని కొత్త సంవత్సరాన్ని మాడిశెట్టి గోపాల్ ఆహ్వానించారు. ఓ వ్యక్తిలోని భావప్రకంపనలే కవిత్వమని గంప ఉమాపతి తేల్చి చెప్పారు. ధనమెంత కుప్ప చేసుకున్నది కాదు లెక్క..్ధర్మం ఎంత నిలబెట్టుకున్నవన్నదే పత్రం అని అన్నవరం దేవేందర్ తమ కవితలో పేర్కొన్నారు.
కె.ఎస్.అనంతాచార్య ‘ఆకుపాట’ చక్కని భావుకతతో రూపుదిద్దుకుంది. యవ్వనం మిసమిసలు తొణికిసలాడిన..పూవుల మకరందం లోంచి..తుమ్మెదల ఝంకారపు వయసు పాట అంటూ తమ కవితకు చక్కని ముగింపునిచ్చారు. బంగారు తెలంగాణ భవితను ప్రసాదించుమని కొత్త సంవత్సరాన్ని డాక్టర్ అడువాల సుజాత అభ్యర్థించారు. డాక్టర్ బి.వి.ఎన్.స్వామి ‘పర్సయింది’ కవిత ఆసక్తికరంగా మలచబడింది. అక్షరం తొడిగిన ఆలోచనలను ఆచార్య కడారు వీరారెడ్డి పాఠకులతో పంచుకున్నారు. ఉగాదులైనా..ఉషస్సులైనా మా నేల పచ్చగా పండినప్పుడే..మారైతు నిండుగా నవ్వినప్పుడే నిజమైన ఉగాది అని కవి గాజోజు నాగభూషణం చక్కగా ఆవిష్కరించారు.
బూర్ల వేంకటేశ్వర్లు తమ కవిత..ద్వారా రారా మన్మధా అంటూ ఆహ్వానించారు. నువ్వస్తే మనుషులకు కొంత ఇరాము దొరికినట్టు ఐతది! కవులకు కొంత కలం కదిలినట్టు ఐతది/ రైతులకు భూమీద సాలుపెట్టినట్టు ఐతదని వ్యాఖ్యానించారు. ఆత్మ చెప్పిన మాటను వినుమని కడారి అనంతరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ ఉగాదైనా..పల్లె తల్లి కొప్పుల నవ్వుల ముద్దబంతులు సింగారించనీ అని డాక్టర్ కలువకుంట రామకృష్ణ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో సల్లగ బతుకుతమం’ అంటూ కొత్త అనిల్ కుమార్ తమ కవితలో పేర్కొన్నారు. పచ్చని చేలతో, పాడి పంటలతో తెలంగాణం వర్దిల్లాలని సంకేపల్లి నాగేంద్ర శర్మ కోరారు. మన జీవితాల్లోని వేదనలు, ఆవేదనలు సమసిపోవాలని బి.హరిప్రియ తమ కవితలోఅభిప్రాయపడ్డారు. ఏమరుపాటు తగదని దామరకుంట శంకరయ్య అంటే..చిరులాస్యాలు పంచుతూ ప్రకృతికాంతను ఎ.పద్మశ్రీ ఆహ్వానించారు. కొత్త వత్సరంలో అనురాగ పుష్పాలు గుబాళించాలని డాక్టర్ సముద్రాల జనార్ధన్ రావు, తమ కవిత ద్వారా ఆశించారు. తీపి చేదుల కలబోతే జీవితమని విలాసాగరం రవీందర్ పేర్కొన్నారు. స్వచ్ఛ్భారత్, స్వేచ్ఛ తెలంగాణను కాంక్షిస్తూ తంగెడ నవనీత రావు తమ కవితను తీర్చిదిద్దారు.
బుట్టెడు కవితా పూలతో కళామతల్లిని పూజించే పరమ ‘్భక్తుడు’ కవి అని పెనుగొండ సరసిజ తమ కవితలో పేర్కొన్నారు. పద్ధతిగా ఆటో నడిపించుమంటూ ఎం.డి.ఖాన్ పిలుపునిచ్చారు. కొత్త వత్సరాన్ని స్వాగతించడానికి ఆమని అందాలతో సిద్ధంగా ఉందనీ సమేదా సమీనా పర్వీన్ తమ కవితలోవివరించారు.
సిరిపురం వాణిశ్రీ తమ కవిత ద్వారా షడ్రుల పచ్చడి రుచి చూపించారు. మంచి చెడులను సమంగా స్వీకరించే శక్తి నివ్వుమని నవ వసంతాన్ని బొమ్మకంటి కిషన్ వేడుకున్నారు. ప్రకృతి ఒడిలో జీవనరాగమంతా/ వసంతగానమై పాడుకోవాలని మమత వేణు కాంక్షించారు. కాలాన్ని జీవన యాగంగా అభివర్ణిస్తూ మొహ్మద్ నసీరోద్దీన్ తమ కవిత రాశారు. ‘పొదన’ పేరుతో తెలంగాణ మాండలికంలో కూకట్ల తిరుపతి రాసిన కవిత అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఉగాది జనహృదిలో చిగురాశల పల్లవులేనని రామ కవి విఠల శర్మ పేర్కొన్నారు. మొలకే మొగ్గై పూవై వికసిస్తుంది..పరిమళకు కవిత్వమై విరబూస్తుందని వారాల ఆనంద్ చక్కని భావుకతతో ‘మొలక’ కవితను రూపుదిద్దారు.
కవిత్వం పంచే మానవతా సిరులను కవి ఎస్.వేణుశ్రీ తమ కవితలో ఏకరువు పెట్టారు. కవితకేదీ కాదనర్హం అని శ్రీశ్రీ గారన్నట్లు గాజుల రవీందర్ ‘గుమ్మి’పై కవిత రాసి అందరినీ మెప్పించారు. ఇలా ఇందులో ఉగాది కవితలేకాక..వివిధ అంశాలపై రాసిన కవితలూ ఉన్నాయి.. వర్ధమానులు, ప్రవర్థమానుల కవితలతో ముస్తాబై వచ్చిన ‘పంచమ స్వరం’కు స్వాగతం పలుకుదాం.

***
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- సాన్వి, కరీంనగర్ సెల్.నం.9440525544