రాష్ట్రీయం

ఏపీలో మంత్రులు వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా దూసుకుపోతుంది. టీడీపీ చెందిన మంత్రులు సైతం వెనుకంజలో ఉండటం గమనార్హం. ఒకరిద్దరు మంత్రులు మినహా అధిక సంఖ్యలో మంత్రులు తొలిరౌండ్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి వెనుకంజలో ఉన్నారు. మంత్రులుగా పనిచేసిన నారా లోకేశ్, నారాయణ, అఖిలప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అయ్యన్నపాత్రుడు, చిన రాజప్ప, అమర్‌నాథ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర వెనుకంజలో ఉన్నారు. కృష్ణాజిల్లా మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, తిరువురు నుంచి జవహర్, చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు ముందంజలో ఉన్నారు. ఎంపీ స్థానాల్లోనూ వైకాపా ఆధిక్యంలో ఉంది. వైకాపా 23 స్థానాల్లో, టీడీపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.