క్రీడాభూమి
టీ-20లకు మిథాలీ రాజ్ వీడ్కోలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: టీ-20 మ్యాచ్లకు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వీడ్కోలు పలికారు. ఇకపై తాను టీ-20 ఆడబోనని వెల్లడించారు. ప్రపంచ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీరాజ్ రికార్డు సృష్టించారు. 2021లో ఐసీసీ ఒనే్డ క్రికెట్ మ్యాచ్లో ఆడేందుకు తనని తాను సన్నద్ధం చేసుకునేందుకు టీ-20 ఫార్మెట్కు దూరం అవుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మిథాలీరాజ్ దేశం తరపున 32 టీ-20 మ్యా చ్లను ఆడారు. ఇందులో మూడు ప్రపంచ కప్లకు ఆడటం విశేషం. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఆడుతున్న భారత టీ-20 జట్టుకు అభినందనలు అని భావోద్వేగంతో అన్నారు. భారత్కు ప్రపంచకప్కు అందించాలన్న నా కల అని , ఇందుకోసం అత్యుత్తమంగా పోరాడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు, తనను నిరంతరం ప్రోత్సహించిన బీసీసీఐకి ధన్యవాదాలు అని వెల్లడించింది.