జాతీయ వార్తలు

ముప్పు ఉంథి రక్షణ కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కాంగ్రెస్ నాయకుల నుంచి తమకు ముప్పు ఉంది. రక్షణ కల్పించాల్సిందిగా కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేలు ముంబయి పోలీసులకు లేఖ రాశారు. తాము మల్లిఖార్జున ఖర్గే, గులామ్ నబీ అజాద్ వంటి ఏ కాంగ్రెస్ నాయకులను కలిసే ప్రసక్తిలేదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఏ ఇతర రాజకీయ పార్టీల నేతలను సైతం కలవబోమని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి తమకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలా ఉండగా కర్ణాటక అసమ్మతి నేతలు పవయిలోని రెనైసాన్స్ హోటల్‌లో బస చేసిన విషయం విదితమే. అసమ్మతి నేతలను బుజ్జగించే కార్యక్రమం మళ్లీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈరోజు ముంబయిలోని హోటల్‌కు వచ్చే అవకాశాలు ఉండటంతో అసమ్మతి ఎమ్మెల్యేలు పైలేఖను రాయటం గమనార్హం. ఇదిలావుండగా తాజాలేఖలో ఎంబీటీ నాగరాజు సైతం సంతకం చేయటం గమనార్హం. శనివారం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, చివరకు ఆదివారంనాడు ఆయన ముంబయి పయనమైన సంగతి తెలిసిందే.