రాష్ట్రీయం

ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను నగరంలోని ‘కిమ్స్’ ఆసుపత్రిలో చేర్పించారు. రాంరెడ్డి కొంత కాలంగా శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే రాంరెడ్డి లోగడ సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్‌గా ఉన్న నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పి. కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని పిఎసి చైర్మన్‌గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.