జాతీయ వార్తలు

ఉపఎన్నికలో కాశ్మీర్ సిఎం మెహబూబా విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని అనంతనాగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ 12వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈనెల 22న ఉపఎన్నికకు పోలింగ్ నిర్వహించగా శనివారం కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచి ఆధిక్యతలో ఉన్న మెహబూబా సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై సునాయాసంగా గెలిచారు. ఆమెకు 17వేలకు పైబడి ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి హిలాలా షాకు 5,587 ఓట్లు దక్కాయి. 2014 సాధారణ ఎన్నికల్లో మెహబూబా అనంత్‌నాగ్ నుంచి ఎంపీగా గెలిచారు. తండ్రి మరణంతో ఆమె సిఎంగా బాధ్యతలు చేపట్టి ఇపుడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.