జాతీయ వార్తలు

మోదీని కలిసిన ఎంపి సిఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉన్నతాధికారులను వెంటబెట్టుకుని మోదీని బాబు కలిశారు. ఆ తర్వాత ప్రధానితో ఆయన ముఖాముఖి మాట్లాడతారని సమాచారం. రాష్ట్రంలో కరవు పరిస్థితి, నీరు-చెట్టు, పోలవరం ప్రాజెక్టు, విభజన సమస్యలు, ఎపికి ప్రత్యేక హోదా, తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు, నీటి వివాదాలు వంటి విషయాలను మోదీకి బాబు వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, సిఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర పాల్గొన్నారు.