జాతీయ వార్తలు
ప్రభుత్వ సేవలను సరళతరం చేశాం:మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 January 2019
వారణాశి: ప్రభుత్వం అందించే వివిధ సేవలను నేరుగా లబ్ధిదారులకు చేరేందుకు సరళతరం చేశామని ప్రధాని మోదీ అన్నారు. ఆయన వారణాశిలో ఏర్పాటుచేసిన ‘ప్రవాస భారతీయ దివాస్(పిబిడి) 2019’లో ప్రసంగించారు. గతంలో భారతదేశం చేయలేదు అని భావించనవి కూడా ఈ నాలుగన్నరేళ్లలో సాధించగలిగామని అన్నారు. దేశంలో కొనసాగుతున్న దోపిడీని గుర్తించి అంతమొందించే పరిష్కార మార్గాలను కనుగొన్నామని, ఫలితంగా 5,78,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించామని చెప్పారు. భారత్ పలు అంశాల్లో ప్రపంచంలో ముందు ఉందని అన్నారు. అంతర్జాతీయ సోలార్ కూటమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.