జాతీయ వార్తలు
అమరులైన జవాన్లకు ప్రధాని మోదీ నివాళి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 February 2019
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడుల్లో అమరులైన 40మంది వీర సైనిక జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. తన జీవితంలో ప్రతి క్షణం వీర సైనికుల త్యాగాలను గుర్తుకుతెచ్చుకుంటూనే ఉంటానని అన్నారు. సైనికులకు పూర్తి స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ఇచ్చామని, వారి ధైర్యసాహసాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. భారత్లో అస్థిరత్వం సృష్టించేందుకు కుట్రల చేసే శక్తుల దుశ్చర్యలను 130 కోట్ల మంది భారతీయులు తిప్పికొడతారని అన్నారు. ఈ ఉగ్రదాడికి పాల్పడినవారు తప్పక శిక్ష అనుభవిస్తారని, తమకు బాసటగా నిలిచిన ప్రపంచ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.