జాతీయ వార్తలు

లోహియా స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోహియా స్ఫూర్తితో భాజపా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, కృషి సింఛాయ్‌ యోజన, ఈ-నామ్‌ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రామ్‌ మనోహర్‌ లోహియా జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ..ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను చూస్తే లోహియా ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన అనుచరులుగా చెప్పుకొంటున్న పార్టీలు ‘మహాకల్తీ కూటమి’గా ఏర్పాటయ్యాయని ఆరోపించారు.