జాతీయ వార్తలు

పుట్టిన రోజున మోదీ గుజరాత్‌లో పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పుట్టిన రోజును సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో జరుపుకున్నారు. ఈ రోజు ఆయన 69వ సంవత్సరంలో అడుగుపెట్టారు. నిన్న రాత్రే గుజరాత్ చేరుకున్న ఆయన ఈ ఉదయం గాంధీ నగర్ నుంచి కేవడియా వెళ్లారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. జంగిల్ సఫారీ పార్క్, సర్దార్ సరోవర్ డ్యామ్‌ను సందర్శించారు. కేవడియాకు హెలికాఫ్టర్‌లో వెళుతూ సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ అందమైన ప్రదేశాన్ని మీరు చూడండి అని కోరారు. అనంతరం జంగిల్ సఫారీ పార్క్‌లో ఆహ్లాదంగా గడిపారు. నర్మదా డ్యామ్ ఎత్తు పెంచటం వల్ల నీటి ప్రవాహం పెరిగింది. ఆయన సర్దార్ సరోవర్ డ్యామ్‌పై నర్మదా నదికి పూజలు చేశారు. మోదీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ తదితరులు ఉన్నారు.