జాతీయ వార్తలు

కుట్రదారులను వదిలిపెట్టం : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:జమ్ముకాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో సైనిక స్థావరంపై జరిగిన ఆత్మాహుతి దాడిని పిరికిపందల చర్యగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ దాడిలో వీరమరణం పొందిన సైనికులకు ఆయన నివాళి అర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ దాడి వెనుక ఉన్నవారిని వదిలిపెట్టేది లేదని, ఇది క్రూరమైన చర్య అని వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితిపై ఆయన హోంమంత్రితో మాట్లాడారు. రక్షణమంత్రి పారిక్కర్‌ను శ్రీనగర్‌కు పంపినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నవారిని విడిచిపెట్టబోమని, వారికి తగిన శిక్ష పడాల్సిందేనని అన్నారు.