జాతీయ వార్తలు

‘హోదా’పై త్వరలోనే మోదీ నిర్ణయం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ తనకు చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. ఈరోజు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీని ఆయన కలిసి కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎపికి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రధాని వద్ద సిఎం ప్రస్తావించారు. ప్రజల భావోద్వేగాలతో కూడుకున్నందున ఈ విషయమై సముచిత నిర్ణయం తీసుకోవాలని తాను విజ్ఞప్తి చేయగా ప్రధాని సానుకూలంగా స్పందించారని బాబు చెప్పారు. ప్రత్యేక హోదా మినహా ఏది ఇచ్చినా ప్రజలు శాంతించే పరిస్థితి లేదని, ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, జాప్యం చేస్తే విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ప్రధానికి వివరించారు. ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకుంటానని మోదీ హామీ ఇచ్చారన్నారు.