జాతీయ వార్తలు
మాతృమూర్తి ఆశీస్సులు తీసుకున్న మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 September 2016
అహ్మదాబాద్: 66వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఇక్కడ తన తల్లి హీరాబెన్ను కలుసుకుని ఆమె ఆశీర్వాదం పొందారు. తన తల్లిని కలిసేందుకు ఆయన శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆమె ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాంధీనగర్ బయలుదేరి వెళ్లారు. జన్మదినం సందర్భంగా రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.