ఆంధ్రప్రదేశ్‌

ఎంపిటిసిని కిడ్నాప్ చేసిన మావోలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, మార్చి 11: విశాఖ ఏజన్సీలోని జికెవీధి మండలం మొండిగెడ్డ తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి డి.తెల్లన్నదొరను శుక్రవారం మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మారుమూల గిరిజన గ్రామమైన మొండిగెడ్డలోని తన ఇంట్లో ఉన్న తెల్లన్నదొరను మావోలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మావోయిస్టులు ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ముక్కలి మహేష్, మామిడి బాలయ్య, వండల బాలయ్యను కిడ్నాప్ చేశారు. 10 రోజుల అనంతరం వీరిని విడిచిపెట్టారు. ఆ తర్వాత జన్మభూమి గ్రామసభకు హాజరైన మాజీ సర్పంచ్ సాగిన వెంకటరమణ కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ క్రమంలో తెల్లన్నదొర కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. కాగా బాక్సైట్ తవ్వకాల జివో 97ను ఉపసంహరించాలనే డిమాండ్‌తోనే మావోలు తెల్లన్నదొరను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.