రాష్ట్రీయం

శైవ మహాపీఠాధిపతిగా మృత్యుంజయ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

27న పట్ట్భాషేక మహోత్సవం
హైదరాబాద్, డిసెంబర్ 19: శ్రీ శైవమహాపీఠానికి 11వ పీఠాధిపతిగా లోకారాధ్య డాక్టర్ అత్తలూరి మృత్యుంజయ శర్మ ఈ నెల 27న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మృత్యుంజయ శర్మకు శైవ ఆచారం ప్రకారం 27వ తేదీ ఉదయం 9.16 గంటలకు పట్ట్భాషేక మహోత్సవం (పీఠాధిరోహణ మహోత్సవం) నాగోలులోని శ్రీ శైవమహాపీఠంలో జరుగుతుందని శైవమహాపీఠం ప్రధాన కార్యదర్శి ముగులు హనుమంతరావు, సహాయ కార్యదర్శి ముదిగొండ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరు కానున్నారని వారు వెల్లడించారు. అలాగే శ్రీశైలంలో నిర్మితమైన శ్రీశైల శాఖ భవన ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని వారు తెలిపారు. భవన ప్రారంభోత్సవం సందర్భంగా దేవతామూర్తుల చరప్రతిష్ఠుల కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.