తెలంగాణ

క్రమశిక్షణారాహిత్యాన్ని క్షమించరాదు: మల్లు రవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి ఎవరు పాల్పడినా క్షమించరాదని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. సిఎల్‌పి నాయకుడు జానారెడ్డిని కోవర్టు అని ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి అనడం క్రమశిక్షణా రాహిత్యమేనని అన్నారు. పాల్వాయికి షోకాజ్ నోటీసు ఇచ్చే విషయాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చూసుకుంటారని రవి చెప్పారు. నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగితే పార్టీ పట్ల ప్రజల్లో తప్పుడ సంకేతాలు వెళతాయన్నారు. కాగా, పాల్వాయికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.