తెలంగాణ

దళితులంటే గౌరవం లేని కెసిఆర్: మోత్కుపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దళితులంటే ఏ మాత్రం గౌరవం ఇవ్వని తెలంగాణ సిఎం కెసిఆర్ అంటరానితనాన్ని పాటిస్తున్నారని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. దళితులకు క్యాబినెట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడంలో అర్థం లేదన్నారు. గొప్ప కోసం భారీ విగ్రహాలు పెడితే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. దళితుల పట్ల కెసిఆర్ వైఖరికి నిరసనగా గురువారం నాడు ఎన్టీఆర్ ఘాట్‌లో తాను ఒకరోజు నిరాహార దీక్ష చేస్తానని నర్సింహులు ప్రకటించారు.