ఆంధ్రప్రదేశ్
11 నుంచి మళ్లీ దీక్ష: ముద్రగడ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 March 2016
కాకినాడ: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాపు కులస్థులకు ఇచ్చిన ఆరు హామీలను ఈ నెల 10లోగా అమలు చేయకుంటే 11వ తేదీ నుంచి మళ్లీ ఆమరణ దీక్షకు దిగుతానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాధం ఎపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన కిర్లంపూడిలోని తన స్వగృహంలో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ, హామీలను నెరవేర్చడానికి బదులు టిడిపి నేతలు తనపై లేనిపోని విమర్శలు చేయడం సరికాదన్నారు. తనను వైకాపా నేత జగన్ నడిపిస్తున్నారని అనడంలో అర్థం లేదన్నారు. తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయడం అన్యాయమని ముద్రగడ అన్నారు.