జాతీయ వార్తలు

బీఎమ్సీ ఎన్నికల్లో ప్రముఖుల ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: మంగళవారం జరుగుతున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో పలువురు సినీ, కార్పొరేట్, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7:30 గంటలకే ఓటింగ్ ప్రారంభమవ్వడంతో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్‌లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరికొద్ది సేపటికే శివసేన చీఫ్ ఉద్దవ్ ధాకరే బంద్రాలోనూ, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే దాదార్‌లోనూ ఓటేశారు. ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్, అనిల్ అంబానీ సతీమణి నీతా అంబానీ, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేక్, శరద్ పవార్, ముంబై మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతా, టీనా అంబాని, సినీనటి రేఖ, అనుష్క శర్మ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.