విజయనగరం

‘మైలాన్’లో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం,నవంబర్ 20: పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారంలో ఉన్న మైలాన్ బల్క్ డ్రగ్ తయారీ కంపెనీలో గురువారం అర్ధరాత్రి విద్యుత్ షార్టుసర్య్కూట్ ప్రమాదంలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మైలాన్ మందుల తయారీ కంపెనీలో యూనిట్ 8లో బ్లాక్ 9లో కాంట్రాక్టు కార్మికులు రామునాయుడు, రాము, జి.దినారాయణ లు రాత్రిపూట విధుల్లో పనిచేస్తున్నారు. మిథైల్ మిశ్రమాన్ని వినియోగించి యంత్రాలను శుభ్రం చేస్తుండగా ఆయూనిట్‌లో విద్యుత్తు షార్టు సర్క్యూట్ చోటుచేసుకుంది. నిప్పురవ్వలు ఒక్కసారిగా మిథైల్ మిశ్రమం పై పడ్డాయి. దీంతో మంటలు రావడంతో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో అదినారాయణ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని విశాఖ కేర్ ఆసుపత్రిలో చికిత్సనిమిత్తం తరలించారు. సంఘటనా స్థలాన్ని విజయనగరం డి ఎస్పీ పివిరత్నం పరిశీలించి ప్రమాద ఘటన పై ఆరాతీసారు. పూసపాటిరేగ ఎస్సై శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు.