జాతీయ వార్తలు

నదిలో పడిన బస్సు 37 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 5: గుజరాత్‌లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఒక బస్సు శుక్రవారం పూర్ణా నదిలో పడిపోవడంతో 37 మంది మృతి చెందారు. దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లా సూపా గ్రామ సమీపంలో వంతెనపై నుంచి వెళ్తూ ఈ బస్సు నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నదిలోనుంచి 37 మృతదేహాలను వెలికి తీసినట్లు నవ్‌సరి పోలీసు సూపరింటెండెంట్ ఎం.ఎస్.్భరడ చెప్పారు. ఈ బస్సు నవ్‌సరి నుంచి ఉకయికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఖచ్చితంగా ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియదని, బస్సు మాత్రం ప్రయాణికులతో నిండి ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వివరించారు. పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, 108 అంబులెన్స్ సర్వీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఆయన తెలిపారు.