నల్గొండ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 21: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రేవణపల్లి, శివారెడ్డిగూడెం, కన్నుముక్కుల, వంకమామిడి, తల్లోనిగూడెం గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలన్నారు. దళారులచే మోస పోకుండా రైతులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలన్నారు.