నల్గొండ
మైనార్ట్టీ విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భువనగిరి, అక్టోబర్ 25: మైనార్టీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యనందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని పాఠశాల ఉపాద్యాయులకు సూచించారు. మంగళవారం మైనార్టి గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులను, భోజనశాలను, మరుగుదొడ్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు విద్యను అందించేందుకు మైనార్టి గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసిందని అన్నారు. మైనార్టి కుటుంభాలు తమ పిల్లలను చదివించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కల్పించిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న బోజనాన్ని పరిశీలించిన అనంతరం వారితో మాట్లాడుతు పాఠ్యాంశాలలో వారి రాణిస్తున్న తీరును తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్ను, స్టాక్ రిజిస్టర్ను ఆమె తనిఖీ చేసారు.