నల్గొండ

మూడు జిల్లాలకు సైకిల్ సారధుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 6: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలకు టి.టిడిపి అడహక్ కమిటీ జిల్లా కన్వీనర్లను ప్రకటించింది. నల్లగొండ జిల్లాకు ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి కేతావత్ బిల్యానాయక్‌ను నియమించారు. సూర్యాపేట జిల్లాకు ఈ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి పటేల్ రమేష్‌రెడ్డిని, యాదాద్రిభువనగిరి జిల్లాకు ఎలిమినేటి సందీప్‌రెడ్డిని నియమించారు. కొత్త జిల్లాల పార్టీ అడహాక్ కమిటీ కన్వీనర్ల నియామకంలో మాజీ మంత్రులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులైన మోత్కులపల్లి నరసింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి వర్గాలు ఆధిపత్య రాజకీయాలు సాగించడంతో కన్వీనర్ల ప్రకటనలో రెండు వర్గాలను సమన్వయం చేసే దిశగా అధిష్టానం కసరత్తు చేసింది. కొత్త జిల్లాలైన యాదాద్రిభువనగిరికి ఉమామాధవరెడ్డి రాజకీయ వారసుడైన ఎలిమినేటి సందీప్‌రెడ్డిని కన్వీనర్‌గా నియమించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఆయనను రాజకీయంగా మరింత ఫోకస్ చేయాలని పార్టీ భావించింది. మోత్కుపల్లి వర్గానికి చెందిన పటేల్ రమేష్‌రెడ్డికి సూర్యాపేట జిల్లా కన్వీనర్‌గా నియమించడంతో రెండు వర్గాలకు చేరోజిల్లా కన్వీనర్లు ఇచ్చినట్లయ్యింది. అయితే నల్లగొండ జిల్లా అధ్యక్ష పదవికి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌లు ఆశించినప్పటికి సామాజిక సమీకరణ నేపధ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు బిల్యాకే అడహాక్ కమిటీ సారధ్య బాధ్యతలు అప్పగించారు.