నల్గొండ

ఘనంగా పుష్పయాగం, గోదాదేవి కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జనవరి 15: గోదాగోష్టి, వికాసతరంగిణి సంయుక్తంగా కోదాడ కాశీనాధం గార్డెన్స్‌లో పుష్పయాగం, గోధాదేవిశ్రీకృష్ణ కళ్యాణాన్ని కన్నులపండువుగా భక్రిశ్రద్దలతో ఘనంగా నిర్వహించాయి. ధనుర్మాసం ముగింపుసందర్భంగా కాశీనాధం గార్డెన్స్‌లో నిర్వహించిన పుష్పయాగం, గోదాదేవిశ్రీకృష్ణ కళ్యాణోత్సవంలో భక్తులు ముఖ్యంగా మహిళలు అధికసంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్దలతో తిలకరించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్ర జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేదపండితుల వేదమంత్రాల మద్య గోదాదేవిశ్రీకృష్ణుని కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్ర జీయర్‌స్వామి వివిద రకాల పూలతో స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించారు.
తదుపరి శ్రీశ్రీశ్రీ రామచంద్ర జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ గోదాదేవి నెలరోజులు కఠినదీక్ష తీసుకొన్న మాసమే ధనుర్మాసమని పేర్కొన్నారు. గోదాదేవి చేపట్టిన ధనుర్మాస దీక్ష కారణంగానే స్వామివారితో కళ్యాణం జరిగిందని ఆయన వివరించారు. డిసెంబర్ నెలలో ధనుర్మాసం ప్రారంభమై సంక్రాంతి వరకు కొనసాగిన తదుపరి ధనుర్మాసం, ధనుర్మాసదీక్ష ముగుస్తుందని ఆయన వివరించారు. కోదాడలోని శ్రీకోదండరామాలయ పునరుద్దరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్చంధంగా భాగస్వాములు కావాలని రామచంద్ర జీయర్‌స్వామి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండపల్లి భారతమ్మ, గోళ్ల చంద్రయ్య, మేళ్లచెర్వు కోటేశ్వర్‌రావు, నాగుబండి నళినీశ్రీ, ఊరె పుష్ప, విజయలక్ష్మి, గరిడెపల్లి లక్ష్మణ్‌రావు, ఆదిలక్ష్మి, దంతాల దమయంతి, యాదా పార్వతి, కాటేపల్లి నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.

19న యాదాద్రిలో 2కె, 3కె రన్
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 15: జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2కె,3కె రన్‌ను యాదాద్రి స్పోర్స్ క్లబ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నట్లు బి లక్ష్మన్ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాచకొండ కమీషనర్‌రేట్ పరిధిలోని గ్రామాలు ఈ 2,3కె రన్‌లో పాల్గొన వచ్చునని 3కె రన్ పురుషులకు,2కె రన్ మహిళలకు గెటుపొందిన వారికి మెదటి,ద్వితియ, తృతియ బహుమతులు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు,కిషన్,విజయ్,నరేష్,కుమార్,సురేందర్ పాల్గొన్నారు.