నల్గొండ

గత ప్రభుత్వాల కుట్రలకు బలైన సాంబశివుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, మార్చి 24: అణగారిన బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం 18 సంవత్సరాలు పోరాడిన సాంబశివుడు అలియాస్ కొనపూరి ఐలయ్య గత ప్రభుత్వాల కుట్రలకు బలైయ్యాడని బెల్లి లలిత సోదరుడు బెల్లి కృష్ణ, కొనపూరి కవిత ఆరోపించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లకురుమ డోలుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆసంఘం వ్యవస్థాపకులు బెల్లి కృష్ణ, కొనపూరి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17 సంవత్సరాలు అజ్ఞాతంగా ఉంటూ ప్రజా పోరాటాలు నడిపిన సాంబశివుడు బుల్లెట్ ద్వారా సామాజిక సమస్యలు పరిష్కారం కావని టిఆర్‌ఎస్‌లో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తిగా కొనియాడారు. సాంబశివునికి నయామ్‌కు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని గత పాలకుల కుట్రలు పన్ని సాంబశివున్ని, అతని సోదరుడైన రాములును హతమార్చడం జరిగిందన్నారు. అదే విధంగా తన పాటల ద్వారా సామాజిక చైతన్యం కల్పిస్తున్న బెల్లి లలితను కిరాయి హంతకులచే హతమార్చారని ఆరోపించారు. కిరాయి హంతకులకు భయపడి 20 ఏళ్ల అజ్ఞాతవాసం గడిపి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నేడు ధైర్యంతో ప్రజల ముందుకు వస్తున్నట్లుగా బెల్లి కృష్ణ తెలిపారు. ఈనెల 26న భువనగిరి వైఎస్సార్ గార్డెన్‌లో జరగనున్న సాంబశివుని సంస్మరణ సభకు రాజకీయాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ డోలుదెబ్బ ఐక్య కార్యచరణ కమిటీ జిల్లా కన్వీనర్ గుండెబోయిన అయోధ్య యాదవ్, రాష్ట్ర గొల్లకురుమ డోలు దెబ్బ సంఘం నాయకురాలు వెనె్నల, ప్రజా గాయకుడు నీలం నర్సింహా, కంకాల కృష్ణ, పుట్ట వీరేశ్, నక్కల చిరంజీవి, ఏడుమేకల మహేష్, వల్లపు ప్రవీణ్, దొడ్డమోని చంద్రం, సుబ్బూరి బీరుమల్లయ్య, జూకంటి వీరేశం, ఏడుమేకల మహేష్, వల్లపు ప్రవీణ్, అవిశెట్టి రమేష్ యాదవ్, రాసాల దయాకర్ తదితరులు పాల్గొన్నారు.