నల్గొండ

ప్రజల ఆశలను వమ్ము చేస్తున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, మే 26: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేడు విశ్వాస్‌ఘాత్ దినంగా పాటిస్తున్నామని నల్లగొండ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడిద బిక్షమయ్యగౌడ్ తెలిపారు. శనివారం స్థానిక రహదారి బంగ్లాలో భువనగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి బిక్షమయ్యగౌడ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాలనలో ప్రజల ఆశలను వమ్ము చేసిందే తప్ప ఇచ్చిన ఎన్నికల హామిలలో ఒక్కటి కూడా నేరవేర్చలేకపోయిందని విమర్శించారు. వంద రోజుల్లో నల్లధనాన్ని వెలికితీసి పేదవారి ఖాతాల్లో 15లక్షల రూపాయాలు జమా చేస్తామని హామి ఇచ్చి నాలుగు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా జమ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఇచ్చిన హామీ నాలుగు సంవత్సరాలుగా అమలుకు నోచుకోలేదన్నారు. ధరల నియంత్రణ, అవినీతి నిర్మూలన చేపట్టకపోవడమే కాక నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులపై భారం అధికమైందన్నారు. కేంద్రంలో అన్ని విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులైన ఆదాని, రిలయన్స్ సంస్థల కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టుకుపోతున్న నీరవ్‌మోడీ, విజయ్‌మాల్యాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, పూటకో మాణభంగం, రోజుకో హత్య జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. నోట్ల రద్దు, జీఏస్టీతో సామాన్యులపై భారం, వ్యవసాయ రంగంలో సంక్షోభం, మతం పేరుతో దాడులు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సాధించిందని దుయ్యబట్టారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ...కేంద్రంలోని మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకొని ఆర్‌ఎస్‌ఎస్ సిధ్ధాంతాలను అమలు చేస్తోందని, అదే విధంగా రాజ్యాంగానికి తూట్లు పోడుస్తు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అందుకు నిదర్శనం కర్ణాటకలో బలం లేని యెడ్యూరప్పను గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించడమేనన్నారు.
బూడిద బిక్షమయ్యగౌడ్‌కు ఘన సన్మానం...
నల్లగొండ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మూడవసారి ఎన్నికైన బూడిద బిక్షమయ్యగౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వీట్ల పంపిణీ చేపట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ పోత్నక్ ప్రమోద్‌కుమార్, భువనగిరి పట్టణ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, ఎడమ బాలక్రిష్ణ, వడిచెర్ల క్రిష్ణయాదవ్, దొనకొండ రాములు, దండు నరేష్, దేవరకొండ నర్సింహ్మచారి, బబ్లూ, కొల్లోజు సతీష్, ఎరుకుల వెంకటేష్, మరికూక్ శ్రీనివాస్, సాబన్‌కార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.