క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 12: రోడ్డుప్రమాదంలో తండ్రి కొడుకులు మృతిచెందిన విషాద సంఘటన హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి గ్రామశివారులో మంగళవారం జరిగింది. ఈప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు పల్స లింగయ్య (58), పల్స సైదులు (36)లు ఉదయం ఇంటి నుండి బయలుదేవి చివ్వెంల మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా దురాజ్‌పల్లి శివారులోని హెచ్‌పీ పెట్రోల్‌బంకు వద్ద ఎదురుగా రాంగ్‌రూట్‌లో వస్తున్న ట్యాంకర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వారు ఇరువురు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు చివ్వెంల ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో ప్రమాదస్థలికి చేరుకొని కంటతడి పెట్టారు. కొన్ని గంటలకు ముందు తమతో అప్యాయంగా మాట్లాడి వెళ్లిన తండ్రి కొడుకులు ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కంట తడి పెట్టారు. వీరి మృతితో గ్రామంలో విషాదం ఛాయలు ఆలుముకున్నాయి.