క్రైమ్/లీగల్

మూసీ కుడి కాల్వలో పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, ఆగస్టు 6: కేతేపల్లి - కొత్తపేట గ్రామాల మధ్య సోమవారం కేతేపల్లి గ్రామానికి చెందిన జంజనం మనోజ్‌కుమార్ (8) మూసీ కుడి కాల్వలో మృతిచెందాడు. మృతుని తండ్రి శివాజీ, ఎస్‌ఐ రజినీకర్ తెలిపిన వివరాల ప్రకారం మనోజ్‌కుమార్ సోమవారం పాఠశాలకు సెలవుదినం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు మూసీ కుడి కాల్వకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో ఆకస్మాత్తుగా మనోజ్‌కుమార్ కనిపించకపోవడంతో తోటి స్నేహితులు కేకలు వేశారు. వెంటనే తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. కాల్వలో వెతకగా కేతేపల్లి - కొత్తపేట మధ్య 8వ నెంబర్ ఫీడర్ వద్ద మనోజ్‌కుమార్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని చూసి తల్లి ఆదిలక్ష్మి బోరున విలపించిన తీరు చూపరులను కంటితడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనోజ్‌కుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వతరగతి చదువుతున్నాడు. తండ్రి శివాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.