నల్గొండ

ఎన్నికల సమరానికి సిద్ధంకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రభుత్వం ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు తెరలేపిందని జరగబోయే ఎన్నికల సమరానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఏఐసీసీ సభ్యురాలు, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతిరెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ జెండా పండుగ సందర్బంగా బస్టాండు సెంటర్ వద్ద జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ గడిచిన నాలుగేండ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పధకాలను పిసిసి మెనీఫెస్టోను ప్రజలకు వివరించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం కోఆర్డినేటర్ మల్లేపల్లి వెంకట్ రెడ్డి,జంగయ్య, మెహన్ రెడ్డి, దేవేందర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.