క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, అక్టోబర్ 11: అప్పుల బాధతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని బ్రామ్మణపల్లిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు కదిరం సత్తయ్య (55) తనకున్న 3ఎకరాల వ్యవసాయ భూమికి సాగు కోసం లక్ష రూపాయలు అప్పు తెచ్చి పంట సాగుచెయ్యగా పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి చెంది తన వ్యవసాయ భూమిలో పురుగుల మందుతాగి మృతిచెందినట్లు తెలిపారు. మృతిని భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.