నల్గొండ

దాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, అక్టోబర్ 14: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో గత పదిరోజులుగా రైతులు నిలువపోసుకున్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం చంద్రశేఖర్ డిమాండు చేశారు. స్థానిక మార్కెట్‌యార్డులో రైతుల ధాన్యం నిలువలను కాంగ్రెస్ నాయకుల బృందం ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరికోతలు పూర్తిచేసుకున్న రైతులు తమ ధాన్యం మార్కెట్‌కు తీసుకవచ్చి పదిరోజులు కావస్తోందని ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు మొదలుకాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆకాల వర్షాలకు ధాన్యం నిలువ పోసుకున్న రైతులు తీశ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. మార్కెట్‌యార్డులో రైతులకు కావలసిన కనీస వసతులు కల్పించాలని అన్నారు. మార్కెట్‌కు ధాన్యం తెచ్చుకున్న రైతులకు సరియైన పట్టాలులేకపోవడం వల్ల మట్టిపై కుప్పలు పోసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిర్యాల మల్లేషం, ఎండి. రెహాన్, వేమవరపు సుధీర్‌బాబు, బొడ్డు అల్లయ్య, గొరిగె నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర పథకాలే విజయానికి దోహదం
* బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని
సూర్యాపేటరూరల్, అక్టోబర్ 14: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలే వచ్చే ఎన్నికల్లో గెలుపునకు దోహదం చేస్తాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని పిన్నాయిపాలెం గ్రామ పంచాయతీ ఆవాసం జెతూనాయక్‌తండాలో మాజీ ఉప సర్పంచ్ రమావత్ నెహ్రూ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీ నుండి వందమంది కార్యకర్తలు సంకినేని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాశయ కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం అమలుచేస్తున్న పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు వాటిని తమ గొప్పగా చెప్పుకుంటుందని విమర్శించారు. కొన్ని పథకాలను తాము అమలుచేస్తున్నామని చెబుతూ మరికొన్ని కేంద్ర పథకాలను పట్టించు కోవడం లేదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పొయిందని, అందువల్లే ఓటమి భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారన్నారు. నియోజకవర్గంలో మంత్రి చేసిన అభివృద్ధి ఏమి లేదని, అధికారంతో మంత్రి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే తనను గెలిపిస్తే అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వర్గాలకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు నల్లకుంట్ల అయోధ్య, ఓబీసీమోర్చా జిల్లా అధ్యక్షుడు తాడోజు సలేంద్రచారి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి దేవరకొండ జనార్ధన్, మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పు శ్రీను, ప్రధాన కార్యదర్శి శ్యామల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అనంతుల వాసుదేవారెడ్డి, వెన్నా శశిధర్‌రెడ్డి, సత్యనారాయణ, మల్సూరు తదితరులు పాల్గొన్నారు.