నల్గొండ

ఉమ్మడి జిల్లాలో పది సీట్లు మావే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 12: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఉమ్మడి జిల్లాలో పది సీట్లు తమ పార్టీయేనని మాజీ మంత్రి, పీసీసీ మేనిఫెస్టో కమిటి కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లీం మైనార్టీల ఆధ్వర్యంలో పెద్ద గడియారం నుండి పాతబస్తీ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లీంల అభివృద్ధికోసం ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలతో పాటు ముస్లీంలను 12శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేశాడని, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ది పొందిందన్నారు. కేసీఆర్‌కు ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మోడీతో జతకట్టాడని తెలిపారు. అనంతరం మాడుగులపల్లికి చెందిన 50కుటుంబాలు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో గుమ్మల మోహన్ రెడ్డి, షాహిద్‌బేద్, గుండెబోయిన మల్లయ యదవ్, ఇంతియాజ్, అఫ్ఫాన్, సమీర్, జహంగీర్, వాహిద్ తదితరులున్నారు.