నల్గొండ

కాంగ్రెస్‌కు అధికారం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 13: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజావిశ్వాసం కోల్పోయారని వచ్చే ఎన్నికల్లో తాను 20వేల మెజార్టీతో విజయం సాధిస్తానని సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారైన నేపధ్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకు, కార్యకర్తలు టికెట్ సాధించిన సందర్భంగా ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసే నాయకులకు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. తన సేవలను గుర్తించి మారోమారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ తరుపున అభ్యర్థితత్వం కోసం పోటీలు పడటం సహజమేనని, అవకాశం కోసం ఎవ్వరూ ప్రయత్నాలు చేసిన తప్పులేదన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగి విజయం సాధిస్తానన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారని, గత కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధినే తాము చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొప్పుల వేణారెడ్డి, బైరు వెంకన్న, వెంపటి సురేష్, అయూబ్‌ఖాన్, అంజద్ ఆలీ, గుంటి సైదులు పాల్గొన్నారు.