నల్గొండ

మహాకూటమి విజయానికి స్పష్టమైన సంకేతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, డిసెంబర్ 7: రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రావటం ఖాయమని శుక్రవారం జరిగిన ఓటింగ్ సరళిద్వారా ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గరిడేపల్లిలో ఆయన ఓటింగ్ సరళిని పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. రాష్టవ్య్రాప్తంగా అందుతున్న సర్వేల ఆధారంగా ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకోవటంలేదని తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ సారధ్యంలోని ప్రజాకూటమి 80 సీట్లు కైవసం చేసుకుంటుదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత పెరిగితే మరో 5 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పయిడిమర్రి రంగనాథ్, జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడెల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.