నల్గొండ

కార్యకర్తలకు అండగా ఉంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 11: కార్యకర్తలకు అందుబాటులో ఉంటూనే ఐదేళ్లలో మునుగోడును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాల్టీ పరిధిలోని శుక్రవారం పంచాయతీ ఎన్నికల గురించి చర్చించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలను ఎప్పటికీ దూరం చేసుకోనన్నారు. అందుబాటులో ఉండటంలేదన్న అపోహలను దూరం చేస్తానన్నారు. ఎన్నిసార్లు వచ్చామని కాదన్నారు. పని అయ్యిందా లేదా అనేది ముఖ్యమన్నారు. నేను ఎక్కడ ఉన్న తన దృష్టి మునుగోడు అభివృద్ధిపైనే ఉంటుందన్నారు. ఐదేళ్లలో మునుగోడును రాష్ట్రానికి మోడల్‌గా తీర్చిదిద్దుతానన్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుంటానని భరోసా ఇచ్చారు. మునుగోడులో క్యాంపు కార్యాలయం, అంబర్‌పేట్‌లో మరో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్ధరాత్రి వచ్చి తలుపుతట్టినా లేచి పనిచేసిపెడుతానని చెప్పారు. క్యాంపు కార్యాలయాలతో పాటు మండలాల వారిగా పీఏలను నియామకం చేసినట్లు చెప్పారు. పార్టీ అభివృద్ధిపై కార్యకర్తలు దృష్టి పెడితే అభివృద్ధిపై తాను బాధ్యత తీసుకుంటానన్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోని ప్రచారం నిర్వహించాలన్నారు. ఎలాంటి గ్రూప్‌లకు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలన్నారు. గ్రామపంచాయతీలు కైవసం చేసుకుంటేనే పల్లెల అభివృద్ధి సులభమవుతుందన్నారు. అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తులను పంచాయతీ బరిలోకి దించి గెలుపు తలుపులు తట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పాశం సంజయ్‌బాబు, బ్లాక్ అధ్యక్షుడు గుండు మల్లయ్యగౌడ్, మండల కమిటీ అధ్యక్షుడు చింతల వెంకట్‌రెడ్డి, నాయకులు చిక్కా నరసింహా, ఉబ్బు వెంకటయ్య, బి.పి.రాములు, బడుగు మాణిక్యం, సుర్వి నరసింహాగౌడ్, వెన్‌రెడ్డి రాజు, తాడూరి వెంకట్‌రెడ్డి, దైద జగన్మోహన్‌రెడ్డి, మల్కాపురం నరసింహా, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కంది భూపాల్‌రెడ్డి, ఆకుల శ్రీకాంత్, రావుల స్వామి, తిరుపతి రవీందర్, చింతల సాయిలు పాల్గొన్నారు.

అధిక వడ్డీ వ్యాపారం చేసే
14 మందిపై కేసులు
* రూ.26లక్షలు, ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు స్వాధీనం
* డీఎస్పీ శ్రీనివాస్
మిర్యాలగూడ టౌన్, జనవరి 11: మిర్యాలగూడ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో అధిక వడ్డీలకు వ్యాపారం చేస్తున్న 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 26 లక్షల రూపాయలు స్వాధీనం చేసినట్టు స్థానిక డిఎస్‌పి పద్మనాధుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని ఆయా వ్యాపారుల సంస్థలపై దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో 14 మందిపై కేసు నమోదు చేసి 720 సంతకాలు ఖాళీ ప్రామిసరి నోట్లు, సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రజలను అధిక వడ్డీపై పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పోలీసులకు సమాచారం ఇస్తే వ్యాపారులపై చర్య చేపడ్తామన్నారు. పట్టణంలో బారా, బీస్ కటింగ్ నిర్వహిస్తున్న పట్టణంలోని షాబునగర్‌లోని బంటు రాంచంద్రు, గొట్టెకనకయ్య, పూల యాదయ్య, ఇస్లాంపురకు చెందిన ఎండి.జావెద్ అలీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. రాంచంద్రు కార్యాలయంలో 1.93 లక్షల రూపాయల నగదు, 7 పాకెట్ పుస్తకాలు, 2 ప్రామిసరి నోట్లు, 3 అకౌంట్ రిజిస్టర్ పుస్తకాలు, 3 ప్రామిసరి నోట్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గొట్టె కనకయ్య రోజువారి ఫైనాన్స్ పుస్తకాలు, 7 పాకెట్ పుస్తకాలు 58,000 రూపాయలు నగదు స్వాధీనం, ఎండి.జావెద్‌అలి వద్ద 2.45 లక్షల నగదు, 40 ప్రామిసరి నోట్లు, 9 చెక్కులు, 2 అప్పు పత్రాలు, పూల యాదయ్య వద్ద 3 చెక్కులు, 33 వేల నగదు, అరతులం బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.

స్థానిక సంస్థ ఎన్నికల్లో
గులాబీ జెండా ఎగురడం ఖాయం
తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్
అడ్డగూడూరు, జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి టీఆర్‌ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని అజింపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై కాంగ్రెస్ పార్టీకి చెందిన 150కుటుంబాలతో పాటు కాంగ్రెస్ ప్రముఖ నాయకులు స్వామి, మొగులయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సంతోష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్‌లను కూడా గులాబి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం చేరినవారిలో కొంతమంది మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో పార్టీలోకి చేరుతున్నామని అదేవిధంగా గ్రామాన్ని ఆభివృద్ధి పధంలోకి తీసుకురావడానికి అందరం కలిసి పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని గ్రామాల్లో గులాబి జెండా ఎగురవేయాలని, దాని కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. అనంతరం మానాయికుంట గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు ఉప్పల రవి కుమార్తె పట్టు వస్త్ర అలకరణ మహోత్సవానికి హజరై ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మహేందర్‌నాధ్, ఎంపీపీ ఓర్లు లక్ష్మి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మేఘారెడ్డి, ఎంపీటీసీ కనె్నబోయిన ఏలేందర్ అండాలు, అడ్డగూడూరు ఎంపీటీసీ జనార్ధన్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు అంథోని, తుంగతుర్తి విద్యార్థి విభాగం కార్యదర్శి అరవింద్ మరియు వివిధ గ్రామాల టీఆర్‌ఎస్ నాయకులు, గ్రామాశాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ రిజిస్ట్రేషన్‌తో భూకబ్జా
* ఐదుగురి అరెస్టు * డీఎస్పీ శ్రీనివాస్
మిర్యాలగూడ టౌన్, జనవరి 11: పట్టణంలోని హనుమాన్‌పేట వెంపటి సుశీలకు చెందిన భూమిని నకిలీ రిజిస్ట్రేషన్ చేసి భూకబ్జాకు పాల్పడ్డ ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్టు స్థానిక డీఎస్పీ పద్మనాధుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని సీతారాంపురానికి చెందిన వెంపటి సుశీల తన భూమిని కొందరు కబ్జా చేశారని టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు జరిపామన్నారు. వెంపటి సుశీల పేర జీపీఏ ఉన్న సర్వే నంబర్ 837లో సుమారు 726 చదరపు గజాల భూమిని ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా మరినేని వినె్సంట్, మోర నరేందర్‌లు సేల్ డీడ్ డాక్యుమెంట్ నంబర్ 5635 ఆఫ్ 2018, 5636/2018 తేదీ 25-6-2018 ద్వారా వారి పేర్ల మీద రెండు భాగాలుగా 363 చదరపు గజాల ప్లాట్లను మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. వాటిలో అక్రమంగా ఒక ఇంటికి పిల్లర్స్ వేసి, మరొక ఇంటిని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు వరకు నిర్మిస్తుండగా ఈనెల 4న సుశీల ఫిర్యాదు చేసిందన్నారు. దర్యాప్తు జరపగా అంతా మోసం అని తేలిందన్నారు. ఇందుకు డాక్యుమెంట్ రైటర్ ననె్నబోయిన చక్రవర్తి అలియాస్ చక్రి రూ.4.25 లక్షలు తీసుకున్నాడని, అందులో నుండి 4 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. చిగుర్ల సుధీర్ అనే వ్యక్తి కొప్పుల నర్సమ్మ అనే పేరుపై వెంపటి సుశీల మాదిరిగా నకిలీ ఆధార్ కార్డు సృష్టించి సహకరించిందన్నారు. ఇదే విధంగా నల్లగొండ జిల్లాలో 3 చోట్ల ఇలాంటి రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. నిందితులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరినేని వినె్సంట్, మోర నరేందర్, నకిలీ ఆధార్ సృష్టికర్త చిగుర్ల సుధీర్, డాక్యుమెంట్ రైటర్ చక్రవర్తి, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాచమల్ల వీరయ్యలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసి స్థానిక జూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చామన్నారు. సమావేశంలో టూటౌన్ ఇన్స్‌పెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

తెలంగాణలో మిగిలేది టీఆర్‌ఎస్ ఒక్కటే..
పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
* మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

11ఎస్‌యుఆర్ 2: పార్టీల్లో చేరికల కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, జనవరి 11: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఇందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట రూరల్, ఆత్మకూర్(ఎస్) మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా గ్రామాల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకొని అభివృద్ధికి పునరంకితం కావాలన్నారు. ప్రజాసేవా చేయాలన్న ఆకాంక్ష కలిగిన వారికి పట్టం కడితేనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ పదవీ ఇక నుండి కత్తిమీద సాములాంటిదని, సక్రమంగా పనిచేయని పక్షంలో వేటు తప్పదన్నారు. అదేవిధంగా పదవీ చేపట్టిన మూడేళ్లలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని, అంతేకాకుండా పారిశుద్య లోపం వంటి ఎలాంటి పొరపాట్లు చేసిన వేటు తప్పని విధంగా చట్టం చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో మిగిలే రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటేనన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలుచేయడంతో పాటు హమీలివ్వకుండా అనేక పథకాలను అమలుచేసి యావత్ భారతవనీకి ఆదర్శంగా నిలిచామన్నారు. రైతులు, వృత్తిదారులు, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నందు వల్ల రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌నే తెలంగాణ ఇంటి పార్టీగా భావించి అఖండ మెజార్టీతో రెండవసారి అధికారం కట్టబెట్టారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, కమ్యూనిస్టులు కనుమరగైపోయాయని, కాంగ్రెస్, బీజేపీలు సైతం అదే బాటలో ఉన్నాయన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం కేసీఆర్ అమలుచేసిన రైతు బంధు,రైతు భీమా పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అమలుచేసేందుకు సిద్దమవుతుండటం కేసీఆర్ సమర్ధతకు నిదర్శనమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతారన్నారు. ప్రజల నాడిని గమినించి వివిధ పార్టీల్లో ఉన్న వారు స్వచ్చంధంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు కాకి కృపాకర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కాకి దయాకర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట
భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్

చౌటుప్పల్, జనవరి 11: చేనేత పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. చౌటుప్పల్ చేనేత సహకార సంఘంలో చేనేత డిజైనింగ్ కంప్యూర్ శిక్షణ శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. చేనేత రంగంలో వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన 250 మంది చేనేత కార్మికులకు సర్ట్ఫీకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బూర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేతను ఒడ్డున వేసి కార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగు పర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో శ్రమిస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాలను ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. చేనేతకు మార్కెట్ మంచి గుర్తింపు ఉందని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేనేతకు అనేక రాయితీలు ఇస్తుందని గుర్తుచేశారు. చేనేత డిజైనింగ్ కంప్యూటర్ శిక్షణను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ కొత్త డిజైన్‌లను రూపొందిస్తూ ప్రజలను ఆకర్షించే విధంగా చేనేత ఉత్పత్తులు ఉండాలని సూచించారు. దీంతో చేనేత కార్మికులకు ఉపాధి మెరుగు కావడంతో పాటు ఆదాయం పెరిగి జీవనోపాధి వృద్ధి చెందుతుందన్నారు. చేనేత వస్త్రాలకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. చేనేతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు కందగట్ల బిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, తడక యాదగిరి, ఎర్రమాద వెంకన్న, విద్యాసాగర్, చింతల దామోదర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, ఎం.డి.బాబాషరీఫ్, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, గోశిక స్వామి, తడక కిరణ్, గోశిక కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.