నల్గొండ

కాంగ్రెస్ కంచుకోట నల్లగొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగిగుట్ట రూరల్, మే 30: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ప్రజల బాధలకు చలించి యూపిఏ ప్రభుత్వంలోని పార్టీలను ఒప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తన పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిందని ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్న కెసిఆర్ అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినట్లుగా ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట పరిధిలోని మైలార్‌గూడెంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎంపిలుగా తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశామని పార్లమెంటులో తెలంగాణ కావాలని నినదించినామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు తెలంగాణ పరిస్థితులు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి అధినేత్రిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందకుకు ప్రతి కాంగ్రెస్ నేత కృషి చేశాడని అన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు సైనికుల్లాంటి కార్యకర్తలు ఉన్నారని సైనికులను గాడిలోపెట్టే కమాండర్ లేడని అన్నారు. కెసిఆర్‌ది కుటుంబ పాలన అని ప్రజల కోసం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కెసిఆర్ నియంతృత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల హామీలు తుంగలో తొక్కారని, పూటకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని రాచరిక కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరించే కాలం దగ్గర్లోనే ఉందన్నారు. డిసిసి అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కెసిఆర్ ఆ మాట నిలబెట్టుకోలేదని, మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా మంత్రిగా లేరని, ఎస్సీలకు మూడెకరాల భూమిని ఇస్తానని ప్రకటించి ఇంత వరకు హామీని నిలబెట్టుకోలేదని, డబుల్ బెడ్‌రూం అంటూ ఆశ చూపి ఓట్లు వేసుకుని ఏ ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇవ్వలేదని, ప్రశ్నించే వారులేకుండా ప్రతి పక్ష పార్టీల వారిని తన పార్టీలో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేశారని, ఉద్యోగాలు అంటూ యువకుల ఓట్లు వేయించుకుని ఇంత వరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వని ఘనత కెసిఆర్‌దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకులు శ్రావణ్, మధు, జగన్‌లాల్, ప్రేమ్‌లాల్, తీన్‌మార్ మల్లన్న, నాయకులు బీర్ల అయిలయ్య, గుండ్లపల్లి భరత్‌గౌడ్, గుండ్లపల్లి నర్సింహ్మ, గుడ్ల వరలక్ష్మి పాల్గొన్నారు.