నల్గొండ

వదినను ఇంటికి తీసుకువస్తూ.. మరిది మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్(ఎం), జూలై 31 : మండలంలోని పి.రేపాక గ్రామానికి చెందిన మూల రాజు(25) కపరాయిపల్లి మేయిన్‌రోడ్డు నుంచి వదినను తీసుకువస్తుండగా పి.రేపాక సమీపంలో ఎదురుగా వస్తున్న టాటాఏసి బండి బైక్‌ను ఢీ కొట్టడంతో రాజు మృతి చెందడంతో వదిన మూల సంతోష తీవ్ర గాయాలై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని బంధువులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఆత్మకూర్( ఎం) మండలంలోని పి.రేపాక గ్రామానికి చెందిన మూల రాజు శనివారం సాయంత్రం మేయిన్‌రోడ్డుపై వదినను బైక్‌పై తీసుకొని వస్తుండగా గ్రామ సమీపంలో టాటా ఏసిఏపి24పి ఏ 9069 నెంబర్ గల శ్రీ్ధర్ కపరాయిపల్లికి చెందిన గ్రామస్తుడు బైక్‌ను ఢీ కొట్టడంతో బలంగా రాజు తల పగలడంతో, సంతోషకు రెండు నడుము, రెండు కాళ్లు ఇరగడంతో హైద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా రాజు మార్గమద్యలో మరణించాడు. సంతోష హైద్రాబాద్‌లో కాకతీయ ఆసుపత్రితో చికిత్స పొందుతున్నది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు భువనగిరి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ఎస్ ఐ శివనాగప్రసాద్ దర్యాప్తు చేస్తున్నట్లు విలేఖరులకు తెలిపారు.