నల్గొండ

నేడు జిల్లాకు ఎంపి కవిత రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 4 : పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్ధాపకురాలు కల్వకుంట్ల కవిత రేపు, ఎల్లుండి రెండురోజుల పాటు జిల్లాలో జరుగబోయే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. నేడు శుక్రవారం రోజున ఉదయం 8 గంటలకు చౌటుప్పల్ ఆంథోని మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి, చౌటుప్పల్ టెక్స్‌టైల్ పార్కును సందర్శిస్తారు. తరువాత నల్లగొండలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 9:30 కు లక్ష్మీ గార్డెన్‌లో జరిగే తెలంగాణ జాగృతి ప్రతినిధుల సమావేశాన్ని ఆమె జెండా ఆవిష్కరించి ప్రారంభిస్తారు. అనంతరం ప్రతినిధుల సభలో ప్రసంగిస్తారు. శనివారం ఉదయం 8కి చెర్వుగట్టు గుడిలో పూజలో పాల్గొంటారు. 9 గంటల నుంచి 2 గంటల వరకు నల్లగొండలో జరిగే తెలంగాణ జాగృతి ప్రతినిధుల రెండోరోజు సమావేశంలో పాల్గొంటారు. 3:30 గంటలకు టౌన్‌హాల్ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మంత్రి జగదీష్‌రెడ్డితో కలసి ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5కు గడియారం సెంటర్‌లో జరిగే సభలో ప్రసంగించనున్నారు.