ఆంధ్రప్రదేశ్
ఆందోళలతో ప్రజకలే నష్టం: ఎంపీ కేశినేని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 August 2016
విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా సాధించేవరకూ రాజీలేని పోరాటం చేస్తామని, దిల్లీలో నిరసనలు చేస్తేనే కేంద్రం గుర్తిస్తుందని విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని సోమవారం విలేఖరులతో అన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తే ప్రజలకే నష్టం కలుగుతుందని, అన్ని పరిస్థితులనూ పరిశీలిస్తూ సిఎం చంద్రబాబు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారన్నారు. పార్లమెంటులో ఆందోళనలకు తమ పార్టీ ఎంపీలంతా సిద్ధమేనని, పదవులకు రాజీనామాలు చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఏదో ఒక మేలు చేస్తుందని తాము వేచి చూస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా సాధనకు సినీనటుడు పవన్కల్యాణ్తో కలిసి పోరాడేందుకు తాము సుముఖంగా ఉన్నామన్నారు.