జాతీయ వార్తలు

సుప్రీంకోర్టునూ గౌరవించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ పదేపదే విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు, కాగ్ వంటి సంస్థలను కూడా రాహుల్ గాంధీ అగౌరవపరుస్తున్నారని ఆమె గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, కాగ్ నివేదికలు చూస్తే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి ఏ అంశమూ లేదని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ మూర్ఖంగా ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.