జాతీయ వార్తలు
ఈసారి ఓటు వేయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 26 April 2019
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఢిల్లీలో లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెక్కి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తున్న సమయంలో నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీనాథ్ సింగ్ మాత్రం ఈసారి తాము ఓటు వేయదలచుకోలేదని చెప్పారు. ఢిల్లీలో గ్యాంగ్ రేప్కు, తరువాత హత్యకు గురయిన మెడికో విద్యార్థిని ‘నిర్భయ’గా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు తమకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చాయని, కాని ఆచరణలో ఏమీ చేయలేదని, దీంతో విసిగిపోయిన తాము ఈసారి ఓటు వేయకూడదని భావిస్తున్నామని వారు చెప్పారు.