జాతీయ వార్తలు

అప్పుడేం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, ఆగస్టు 27: కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ నరకం అంటూ పారికర్ చేసి వ్యాఖ్యలను శనివారం ఇక్కడ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ పాకిస్తాన్ పర్యటనకు పారికర్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని దిగ్విజయ్ సింగ్ నిలదీశారు.‘ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్(పాక్ ప్రధాని) ఇంట్లో పెళ్లికి ఎలా హాజరయ్యారు?. మీరు చెబుతున్నట్టు అక్కడ నరకమే ఉంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?’అని ఆయన ప్రశ్నించారు. గోవా కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశానికి హాజరైన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ రక్షణ మంత్రిపై విమర్శలు చేశారు.‘పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన బిజెపి సీనియర్ నేత అద్వానీ అక్కడ మహ్మద్ ఆలీ జిన్నాను ఆకాశానికి ఎత్తేశారు. జిన్నా లౌకిక వాదని అద్వానీ పొగిడేశారు’ అని ఈ విషయాలు పారికర్‌గు తెలియవా అన్నారు. వాజపేయి ప్రధానిగా ఉండగా లాహోర్‌కు బస్సు నడిపిన విషయాన్ని దిగ్విజయ్ గుర్తుచేశారు. సొంత పార్టీ సీనియర్లు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వస్తుంటే పారికర్ ఎందుకు అభ్యంతర చెప్పడం లేదని ఆయన అడిగారు. అలాగే పాకిస్తాన్‌ను ప్రశంసిస్తూ మాట్లాడిన కర్నాటక మాజీ ఎంపీ రమ్యపై బిజెపినేత దేశద్రోహం కేసుపెట్టడం సిగ్గుచేటని దిగ్విజయ్ విమర్శించారు.