జాతీయ వార్తలు

‘మళ్లీ టీడీపీదే అధికారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి లంక దినకర్ జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఏ.పీలో జరిగిన ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని జాతీయ స్థాయిలోని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయన్నారు. 2014 కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని కాని చివరికి తెలుగుదేశం పార్టీ ఏ.పీలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఏ.పీలో తెలుగుదేశం పార్టీ 110 శాసనసభ స్థానాలను గెలుచుకుని అధికారం దక్కించుకుంటుందని దినకర్ చెప్పారు.