జాతీయ వార్తలు

అమరావతి కేసు విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్ నుతన రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం నాడు గ్రీన్‌ట్రిబ్యునలోని జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి. అయితే రాజధాని నిర్మాణానికి అనుకూలంగా రైతు సాధన సమితి పేరుతో కొంతమంది రైతులు ఈ కేసులో ఇంప్లీడ్ కావడానికి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం ఈ కేసుతో పాటు విచారణను స్వీకరించింది