జాతీయ వార్తలు

ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఓటుకు నోటు కేసు విచారణను త్వరగా పూర్తి చేసి దోషులకు తగిన శిక్ష విధించాలని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. ఈ కేసు ఆలస్యానికి కారణం కేవలం రాజకీయ స్వార్థమేనని ఆయన విమర్శించారు. సోమవారం నారాయణ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ అన్ని పార్టీలతో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో తాను పాల్గొన్నట్లు వెల్లడించారు. విదేశాలలో, స్వదేశంలో వలసలు నేపథ్యంలో అందరికీ ఓటు హక్కు వినియోగంపై చర్చించినట్లు చెప్పారు. దీనిపై సుప్రీం కోర్టు సూచనల మేరకు ఎన్నికల సంఘం నివేదిక తయారు చేసిందని అన్నారు. ఆన్‌లైన్ ద్వారా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘానికి సూచించినట్లు ఆయన తెలిపారు.