జాతీయ వార్తలు

ఏం చేశారని మోదీ మేనియా2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 13: ప్రధానిగా ఏం చేశారని దేశ వ్యాప్తంగా 3మోదీ మేనియా4 వీస్తోందో తనకు అసలు అర్థం కావడం లేదని కర్నాటకలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సీఎల్‌పీ నేత సిద్ద రామయ్య వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కర్నాటక ఆర్థికంగా ఎంతగా చితికిపోయిందో అందరికీ తెలిసేందేనని అన్నారు. మైసూరులో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 3అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టి సున్నితమైన అంశాలతో ప్రజల మనోభావాలతో ఆడుకొని అధికారాన్ని చేపట్టారని2 రామయ్య విమర్శించారు. గత ఐదేళ్లలో మోదీ హయాంలో దేశంలో జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయినప్పటికీ మీడియా సహా ప్రజలంతా 3నమో2కు మద్దతు పలకడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గత ఎన్డీయే ప్రభుత్వం నాశనం చేసినా ఎందుకీ మోదీ.. మోదీ.. మోదీ అని వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐదేళ్ల హయాంలో దేశ ఆర్థికాభివృద్ధికి ఏం చేశారు.. పెద్ద నోట్ల రద్దుతో ఎవరికి.. ఏం ఒరిగిందో మీడియా బీజేపీ నేతలను ప్రశ్నించాలని రామయ్య అన్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది కానీ.. అది బీజేపీ వల్ల సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. పుల్వామాలో ఉగ్రవాద దాడుల్లో నేపథ్యంలో జరిగిన భారత్ ఎయిర్ స్ట్రయిక్స్‌లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారో అటు రక్షణ శాఖకు కానీ.. ప్రధాన మంత్రి కార్యాలయానికి కానీ తెలియకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.