జాతీయ వార్తలు

బ్యాంకుల్లో స్థలం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిర్డీ, జూన్ 14: షిర్డీలోని సాయి మందిరంలో శుక్రవారం హుండీ లెక్కింపు ప్రక్రియ ఆగిపోయింది. భక్తులు వేసే కాయన్లను భద్రపరిచేందుకు స్థలాభావమే కారణమని షిర్డీ సంస్థాన్ పేర్కొంది. ఈమేరకు బ్యాంకులకు, రిజర్వు బ్యాంక్‌కు సంస్థాన్ సీఈవో దీపక్ ముగ్లికర్ లేఖ రాశారు. ‘సంస్థాన్‌లో భక్తులు హుండీల్లో వేసిన నగదును వారంలో రెండుసార్లు బ్యాంకు అధికారుల సమక్షంలో లెక్కిస్తాం.. లెక్కించిన ప్రతిసారి సరాసరి రెండు కోట్ల రూపాయిలు రాగా ఐదు లక్షల నాణేలు ఉంటున్నాయని.. వీటిని భద్రపరిచే అంశంలో చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి లేఖ రాసినట్లు’ ఆయన వివరించారు.