జాతీయ వార్తలు

బలహీనపడ్డ వాయు తుపాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూన్ 15: గత మూడు రోజులుగా గుజరాత్‌ను వణికించిన వాయు తుపాన్ బలహీనపడింది. ఇది వాయుగుండంగా మారి సౌరాష్ట్ర, కచ్ తీరప్రాంతాలను సోమవారం సాయంత్రానికి తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పోరుబందర్‌కు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుపాన్ గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని ఐఎంఏ తెలిపింది. వాయు తుపాన్ ప్రభావం వల్ల సౌరాష్టల్రో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసాయని తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురుగా వర్షాలు పడ్డట్లు వెల్లడించింది.